వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీల గుండెల్లో రైళ్లు: పోరుయాత్రపై కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
మహబూబ్‌నగర్: తన పోరు యాత్రతో ఇతర రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం చేపట్టిన ఆయన పోరు యాత్ర శనివారం మూడో రోజుకు చేరుకుంది. ఆయన పోరు యాత్ర శనివారం మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన పోరు యాత్రకు విశేష స్పందన లభిస్తోందని, తన పోరు యాత్ర ప్రజాయాత్రగా మారుతోందని ఆయన అన్నారు. దీంతో ఇతర రాజకీయ పార్టీల్లో గుబులు ప్రారంభమైందని ఆయన అన్నారు.

తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆయన అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ ఏర్పడుతుందని, బిజెపి తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉందని ప్రజలు నమ్ముతున్నారని, దీంతో ప్రజల్లో బిజెపి పట్ల విశ్వసనీయత పెరుగుతోందని ఆయన అన్నారు. 2014లో బిజెపి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని ఆయన యుపిఎ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శించారు.

English summary
BJP president Kishan Reddy said that his poru yatra is successful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X