వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత పంజా: మరో డిఎంకె మాజీ మంత్రి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Vellakovil Swaminathan
చెన్నై: కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె నేతలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పంజా విసురుతూనే ఉన్నారు. డిఎంకె నాయకుడు, మరో మాజీ మంత్రి వెల్లకోవిలి స్వామినాథన్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కరుణానిధి మంత్రి వర్గంలో జాతీయ రహదారుల మంత్రిగా పనిచేసిన స్వామినాథన్‌ను అక్రమ భూకబ్జా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భూ కబ్జా కేసుల్లో అరెస్టయిన నాలుగు మాజీ మంత్రి స్వామినాథన్.

ఇంతకు ముందు వీరపాండి అరుముగం, కె. పొన్ముడి, కెఎన్ నెహ్రూ అరెస్టయ్యారు. వీరికి ఈ కేసుల్లో బెయిల్ కూడా లభించింది. మరో మాజీ మంత్రి కెపి సామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ జైలులో ఉన్నారు. ఆయనకు కూడా ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయని జయలలిత అంటున్నారు. అయితే రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని కరుణానిధి విమర్శిస్తున్నారు. తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, కరుణానిధి కుమారుడు ఎంకె స్టాలిన్‌పై కూడా కేసు నమోదైంది.

English summary
Another former DMK minister Vellakovil Swaminathan has been arrested on land grabbing charges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X