రూ.10 కోట్ల వ్యాపారమైనా వద్దా?: సిఎం కిరణ్ చురకలు

తమ వ్యాపారం అంధకారం చేశారని, వ్యాట్ ఏ రాష్ట్రంలో లేదని కేవలం మన రాష్ట్రంలోనే ఉందని సిఎంను కలిసిన వ్యాపారులు ఆ తర్వాత ఆవేదన వ్యక్తం చేశారు. తమను అధికారులు కూడా వేధిస్తున్నారన్నారు. కాగా వ్యాట్ను నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో వస్త్ర వ్యాపారులు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో బంద్, కనిగిరిలో ర్యాలీలు, చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో రాస్తారోకోలు ఇలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వస్త్ర వ్యాపారులు ఆందోళనకు దిగారు. కాగా గుంటూరు జిల్లా నరసారావు పేటలో వైయస్ జగన్, టిడిపి నేత కోడెల శివ ప్రసాద్ పోటీ పోటీ దీక్షలకు దిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications