జూడాలను చర్చలకు ఆహ్వానించలేదు: డిఎల్ స్పష్టం
జూనియర్ డాక్టర్ల సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్టయిఫండ్ చెల్లింపుపైనే ప్రధానంగా సమస్య జఠిలమైంది. జూనియర్ డాక్టర్ల డిమాండ్ మేరకు స్టయిఫండ్ను పెంచలేమని, ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రమే ఎక్కువగా చెల్లిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. జూనియర్ డాక్టర్లు ఎంత వరకు సమ్మె చేస్తారో చూద్దామని ధోరణితో వ్యవహరించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. కాగా, జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్ష సోమవారం ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఇద్దరు డాక్టర్ల ఆరోగ్యం కూడా క్షీణించింది. దాంతో వారికి ప్రతిపక్షాల మద్దతు పెరుగుతోంది.
Comments
English summary
Healyh minister DL Ravindra Reddy clarified that jr doctors were not invited for talks.
Story first published: Monday, January 30, 2012, 14:55 [IST]