వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయి 'బెయిల్‌'పై కౌంటర్, సునీల్ కస్టడీపై హైకోర్టుకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy-Sunil Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అరెస్టైన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం రిమాండును ఫిబ్రవరి 14వ తేది వరకు పొడిగించింది. తనకు బెయిల్ కావాలని విజయ సాయి రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను ఫిబ్రవరి 9వ తేదికి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ పైన సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసింది. విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇవ్వవద్దని అందులో పేర్కొంది.

కాగా ఎమ్మార్ కేసులో అరెస్టైన సునీల్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సునీల్ రెడ్డిని మూడు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకున్న సిబిఐ సోమవారం మరో వారం రోజులు తమకు అప్పగించాలని సిబిఐ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు అంగీకరించలేదు. దీంతో సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు సోమవారం అరెస్టైన బిపి ఆచార్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆచార్య నీరసంగా ఉన్నారని, ఆయనకు ఎప్పటికప్పుడు గ్లూకోజ్ అందించాలని వైద్యులు సూచించారు. అనంతరం బిపి ఆచార్యను దిల్ కుషా అతిథి గృహానికి తరలించారు. ఆచార్య సతీమణి రంజనా ఆచార్య ఆయనను సిబిఐ ఆఫీసులో కలిశారు. కాగా ప్రభుత్వ సిఎస్ పంకజ్ ద్వివేదితో సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ భేటీ అయ్యారు.

English summary
CBI filed counter on Vijaya Sai Reddy bail petition and goes to High Court on Sunil Reddy custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X