రేపు జూడాల చలో హైదరాబాద్, సామూహిక దీక్షల యోచన

గత నెల రోజులుగా జూనియర్ డాక్టర్లు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తొలుత రిలే నిరాహార దీక్షలు చేస్తూ సాధారణ సేవలను బహిష్కరించారు. ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగిస్తే భయపడేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరింది. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిని దీక్షా శిబిరం నుంచి ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకతను దీక్ష విరమించాడు. మిగతా ఇద్దరిని ఈ రాత్రి శిబిరం నుంచి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలిస్తే సామూహిక ఆమరణ నిరాహార దీక్షలకు దిగే యోచనలో జూనియర్ డాక్టర్లున్నారు.
రాష్ట్రంలో పది టీచింగ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పది టీచింగ్ ఆస్పత్రుల్లో ఒక్కో ఆస్పత్రి నుంచి ముగ్గురేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధపడుతున్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడకపోతే అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని జూనియర్ డాక్ట్రర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ వైద్యుల ఆందోళనకు ప్రతిపక్షాలన్నీ మద్దతు ప్రకటించాయి.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications