పార్టీల పేరుతో చిదంబరం దాటవేత: తెలంగాణపై నాగం

చిదంబరం వ్యాఖ్యల్లో తెలంగాణ ఉద్యమం అణిచివేత ధోరణి కనిపిస్తోందని నాగం జనార్ధన్ రెడ్డి మహబూబ్ నగర్లో అన్నారు. తెలంగాణపై కేంద్రం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. దాటవేత ధోరణిలో భాగంగానే చిదంబరం ప్రతిసారి నాలుగు పార్టీల ప్రస్తావనను తీసుకు వస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో తాగునీటి సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో స్పందించకుంటే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications