ఒత్తిడితో ఆచార్య డిశ్చార్జ్: లాయర్, పిపిపై జడ్జి ఆగ్రహం

అనవసర వ్యాఖ్యలతో కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని ఆగ్రహించారు. ఇలాంటి జడ్జిమెంట్ సమయాల్లో సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఆచార్యకు కోర్టు ఈ నెల 15వ తారీఖు వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆచార్యను రెండు రోజుల సిబిఐ కస్టడీకి కోర్టు మంగళవారం అనుమతించిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం ఆయనకు గుండెనొప్పి రావడంతో నిమ్స్కు తరలించారు. కాగా బిపి ఆచార్యపై ప్రభుత్వం వేటు వేసింది. నిబంధనల ప్రకారం 48 గంటల పాటు ఆయన జైళ్లో ఉండటంతో ఆయనను సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications