ఎమ్మార్ కుంభకోణం కేసు: 2002, 2010 మధ్య కుట్ర
విల్లాలను, ప్లాట్లను అధిక ధరలకు విక్రయించి, ఒప్పందంలో పేర్కొన్న ధరలకు మాత్రమే విక్రయించినట్లు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు చూపడానికి అధికారులు సహకరించారనేది ప్రధాన ఆరోపణ. పత్రాల్లో చూపిన ధరల కన్నా మించి వసూలు చేసిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారని చెప్పింది. ఎపిఐఐసి ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తూ లీజు రెంటల్స్ను నిర్ణయించడంలో ఐఎఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, కె విశ్వేశరరావు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమీకృత ప్రాజెక్టు లక్ష్యాలను దెబ్బ తీస్తూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది.
రంగారావు, కోనేరు ప్రసాద్, శ్రీకాంత్ జోషీ విల్లాలను, ప్లాట్లను అధిక ధరలకు విక్రయించే పాత్ర పోషించారని ఆరోపించింది. నిర్ణీత ధరలకు మించి వసూలు చేసిన సొమ్మును హైదరాబాద్, దుబాయ్లకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీల ఖాతా పుస్తకాల్లో చేర్చలేదని సిబిఐ ఆరోపించింది. 26 శాతం వాటా ఉన్న ఎపిఐఐసికి అందులో వాటా ఇవ్వలేదని సిబిఐ అభియోగం మోపింది.