వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపారు: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కాకినాడ: యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ కార్మిక నేత మురళీమోహన్‌ను పోలీసులు కొట్టి చంపారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. కార్మిక నేత మురళీమోహన్ కుటుంబ సభ్యులను ఆయన శుక్రవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మురళీ మోహన్ చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. కార్మిక నేతను పోలీసులు కొట్టి చంపి, గుండెపోటుతో మరణించాడని చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. కొట్టి చంపి మురళీమోహన్ గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించడం బాధాకరమని ఆయన అన్నారు.

గొడవల్లో యాజమాన్య ప్రతినిధి చంద్రశేఖర్ మరణించడం కూడా బాధాకరమేనని ఆయన అన్నారు. పాండిచ్చేరి ప్రభుత్వ తీరుపై ఆయన ధ్వజమెత్తారు. కార్మిక నాయకుడు మురళీమోహన్ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయడం నేరమా అని ఆయన ప్రశ్నించారు. మురళీమోహన్ మృతి వల్లనే కార్మీకులు ఆందోళనకు దిగారని ఆయన అన్నారు. తొమ్మిది మంది కార్మికులు గాయపడితే ప్రభుత్వం నిద్రపోతోందా అని ఆయన అడిగారు.

English summary
YSR Congress party president YS Jagan akkeged that police have killed Regency ceramics workers leader Murali Mohan.ys jagan, ysr congress, yanam, regency ceramics, వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు, యానాం, రీజెన్సీ సిరామిక్స్
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X