ఆ పాపం ఊరికే పోదు: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma
హైదరాబాద్: స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనతా వస్త్రాల పేరుతో పథకం ప్రారంభిస్తే దానిని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సిఎం కాగానే ఎత్తేసి చేనేత మగ్గం పొట్ట కొట్టారని, ఆ పాపం ఊరికే పోదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శనివారం మండిపడ్డారు. అధికారంలో ఉన్నంతకాలం చేనేత కార్మికుల బతుకును బుగ్గిపాలు చేసి, ఇప్పుడు వారి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల గురించి బాబు పట్టించుకోలేదన్నారు. బాబు అధికారంలోకి రాకముందు రూ.135 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న ఆప్కో ఆ తర్వాత రూ.25 కోట్లకు పడిపోయిందని ఆరోపించారు. వందల ఆప్కో దుకాణాలు మూయించారని దుయ్యబట్టారు. బాబు హయాంలో చేనేత సంక్షేమానికి సరైన చర్యలు తీసుకుంటే ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదన్నారు. హైటెక్కులకు పోయి రైతులు, నేత కార్మికుల బతుకులను బాబు చిద్రం చేశారన్నాలు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నేత కార్మికుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆయన మృతి తర్వాత వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతగా బాబు రెండేళ్లుగా ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అన్నారు. రాజకీయం కోసం బాబు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వైయస్ అధికారంలోకి రాగానే ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేశారన్నారు. ఆత్మహత్యలను అపహాస్యం చేసిన బాబు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు. రెండేళ్లుగా కాంగ్రెసు ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించని బాబు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు బాబు నమ్ముతారని అనుకోవడం భ్రమే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+