హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం కాళ్లు పట్టుకుని పరువు తీశారు: పొన్నాలపై జూపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Jupalli Krishna Rao
హైదరాబాద్: తెలంగాణకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుని పరువు తీశారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు జూపల్లి కృష్ణా రావు వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు తీసుకోవడానికి సిద్ధపడిన తెలంగాణ కాంగ్రెసు శానససభ్యులపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రెండోసారి రాజీనామా చేయకుండా మేనేజ్ చేసినందుకే తెలంగాణ శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు బలిదానాలు చేశారని, ఈ స్థితిలో పదవులు తీసుకోవడమంటే తెలంగాణకు ద్రోహం చేయడమేనని, ఇటువంటివారని ప్రజలు గ్రామాల్లోకి రానివ్వరని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఉన్న తెలంగాణ మంత్రులకే గౌరవం లేదని, కొత్తగా మంత్రి పదవులు తీసుకునే వారు ఏం ఉద్ధరిస్తారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయం అమలులో భాగంగానే తెలంగాణ శానససభ్యులకు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం జూపల్లి కృష్ణారావు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శాసనసభా సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరారు. కాంగ్రెసు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన వచ్చే ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి తెరాస తరఫున పోటీ చేయనున్నారు.

English summary
TRS leader Jupalli Krishna Rao lashed out at minister from Telangana region, Ponnala Laxmaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X