కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: కిరణ్, టిడిపి టిఆర్ఎస్ గైర్హాజరు
గత బడ్జెట్లో అమలుకు నోచుకోని కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో సమావేశానికి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి పదహారు మంది ఎంపీలు హాజరయ్యారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. కాగా ముఖ్యమంత్రి సమావేశంపై టిడిపి మండిపడింది. సిఎం రెండు నెలల క్రితం ఈ సమావేశం నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. కేవలం మొక్కుబడి కోసం కంటితుడుపు చర్యగా మాత్రమే సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించింది.
Comments
English summary
CM Kiran Kumar Reddy suggested state MPs that must pressure on central government about pending railway projects.
Story first published: Thursday, February 9, 2012, 15:14 [IST]