కేంద్రంపై ఒత్తిడి తెద్దాం: కిరణ్, టిడిపి టిఆర్ఎస్ గైర్హాజరు

గత బడ్జెట్లో అమలుకు నోచుకోని కొత్త రైళ్లు, రైల్వే మార్గాలు, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు తదితర అంశాలను ఈ భేటీలో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో సమావేశానికి తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి పదహారు మంది ఎంపీలు హాజరయ్యారు. మీడియాకు అనుమతి నిరాకరించారు. కాగా ముఖ్యమంత్రి సమావేశంపై టిడిపి మండిపడింది. సిఎం రెండు నెలల క్రితం ఈ సమావేశం నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. కేవలం మొక్కుబడి కోసం కంటితుడుపు చర్యగా మాత్రమే సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications