బాబుతో సిఎం ఫిక్సింగ్ అవాస్తవం: డిఎల్‌కు మంత్రులు

Anam Ramanarayana Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి శుక్రవారం ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు అవాస్తవమని ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతిలో అన్నారు. అలాంటి ఆరోపణలు అర్థరహితమన్నారు. రాజకీయ వైరుద్యం ఉన్న తెలుగుదేశం పార్టీతో కిరణ్ ఎలా కుమ్మక్కు అవుతారన్నారు. ఈ నెల 17న శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెడతామని ఆయన చెప్పారు. బడ్జెట్ సామాన్యులకు ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, ఆయన స్థాయికి తగినట్లుగా మాట్లాడాలన్నారు. డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చేది కాంగ్రెసు పార్టీ కాదని మరో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి వేరుగా అన్నారు. బాబు, కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

మరోవైపు తనపై వచ్చి ఆరోపణలను రాజకీయ కోణంలో చూడవద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ శుక్రవారం మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి సూచించారు. ఎవరినో రక్షించేందుకు తనను బలి పశువు చేశారని డిఎల్ ప్రచారం చేయడం సరికాదన్నారు. ఆరోపణలపై డిఎల్ తనకు మద్దతిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే ఆ ఆరోపణలను రాజకీయ కోణంలో చూడవద్దని డిఎల్‌కు సూచించారు. మంత్రివర్గంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తనకు మద్దతిచ్చిన బిసి వర్గాలకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తాను వివరణ ఇచ్చుకున్నానని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ అంశంలో త్వరలో నిజాలు బయట పడతాయని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+