మామను చంపి పూలదండ వేశాడు: బాబుపై కెసిఆర్

చంద్రబాబు, ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని, కుమ్మక్కు కాకపోతే చంద్రబాబు వరంగల్ జిల్లా పర్యటనకు ఐదు వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తారా అని ఆయన అన్నారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని వాళ్ల మంత్రే అంటున్నారని ఆయన డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలనుద్దేశించి అన్నారు. శాసనసభలో తాము గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ఆయన అన్నారు. సకల జనుల సమ్మె విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వేటినీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణ విద్యార్థులపై రౌడీ షీట్లు తెరుస్తూ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, విద్యార్థులను అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. శాసనసభలో సమయం సందర్భాన్ని బట్టి తెలంగాణను ప్రస్తావిస్తామని, తెలంగాణ కోసం శాసనసభలో కచ్చితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications