హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ఓ పగటి దొంగ, నిలువునా చీలుస్తాం:మోత్కుపల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothkupally Narsimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం విరుచుకు పడ్డారు. కెసిఆర్ తాగుబోతు, తిరుగుబోతు, దోపిడీదారు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్‌ను నిలువునా చీలుస్తామని హెచ్చరించారు. పాసుపోర్టు నుండి పోలవరం దాకా ఆయనది దొంగ బతుకు అన్నారు. తెలంగాణవాదాన్ని పోలవరంలో ముంచిన పాపాత్ముడు అని అన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు ఆయన గల్లీ గల్లీలో ముక్కు నేలకు రాయాలన్నారు. పోలవరం టెండర్ల కోసం అమ్ముడు పోయారని ఆరోపించారు. కేంద్రానికి అమ్ముడు పోయిన పగటి దొంగ అని అన్నారు. తెలంగాణవాదాన్ని వ్యాపారంగా మార్చిన ఘనత ఆయనదే అన్నారు. ఆయన అక్రమ సంపాదన ప్రజల ముందు పెడతామన్నారు. ఆయన ఆస్తుల సంగతి ఆరా తీస్తున్నామని చెప్పారు.

కెసిఆర్‌ను రెండుగా చీల్చినా పాపం లేదన్నారు. తాను తెలంగాణ వచ్చే దాకా పోటీ చేయకుండా ఉంటానని ఆ దమ్ము కెసిఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు. ఆయన పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని, ఓ సన్నాసి అన్నారు. పోతిరెడ్డిపాడు, పులిచింతల కడితే రక్తం పారిస్తానన్న కెసిఆర్ ఇప్పుడు తన ఇంటికి ధన రాశులు పారించుకుంటున్నారని ఆరోపించారు.

English summary
TDP senior mla Mothkupalli Narasimhulu lashes out at TRS chief K Chandrasekhar Rao. He accused that KCR make Telangana sentiment as business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X