తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తినిచ్చింది: ఛత్తీస్‌గఢ్ సిఎం

Raman Singh
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమమే తమకు స్ఫూర్తినిచ్చిందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ శనివారం అన్నారు. నిజాం కళాశాల మైదానంలో బిజెపి తెలంగాణ పోరు ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్ర నేత వెంకయ్య నాయుడు, రమణ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణ్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమమే తమకు స్ఫూర్తినిచ్చిందని, అదే తమ రాష్ట్ర ఉద్యమానికి ఊపునిచ్చిందని ఆయన తెలిపారు. చిన్న రాష్ట్రాలతేనే ప్రగతి సాధ్యమని, తమ రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధే అందుకు నిదర్శనమని, జాతీయ వ్యవసాయ సగటు అభివృద్ధి రేటు 2.3 శాతమైతే మా రాష్ట్ర సగటు 6.4గా ఉందన్నారు. దేశంలో 22% ఇనుము ఉత్పత్తి మాదే. 30% సిమెంటును మేమే ఉత్పత్తి చేస్తున్నామని, మా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఉండవని, ఎవరికైనా అరగంట పాటు విద్యుత్తు లేకపోతే నేరుగా సిఎంకే ఫోన్ చేస్తారన్నారు. ఈ ప్రగతంతా చిన్న రాష్ట్రం కావడం వల్లే సాధ్యమైందని, కానీ చిన్న రాష్ట్రాల వల్ల ప్రగతి సాధ్యం కాదని కొన్ని పార్టీలు చెబుతున్నాయని, అంతగా అనుమానాలుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ పరిశీలించుకోవచ్చునని సవాలు విసిరారు.

తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. 2004 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణకు అనుకూల ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు. తర్వాత కమిటీల పేరుతో కాలయాపన చేసింది తప్ప అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రకు న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడ్డ రేవడిలా మారే అవకాశముందని జోస్యం చెప్పారు. టిడిపి కూడా రెండు ప్రాంతాల్లో రెండు విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కిషన్‌ రెడ్డి డిమాండ్ చేశారు. బిల్లుకు అనుకూలంగా ఓటువేయడానికి ఎన్డీయేకు చెందిన 166 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇప్పటికే తెలంగాణ జిల్లాలు అనేక సమస్యలతో అతలాకుతలమవుతున్నాయన్నారు. 2009 ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో జట్టు కట్టి తెలంగాణ ఇస్తామన్న టిడిపి ఆ తర్వాత నిండా ముంచిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకుని తెలంగాణ బిల్లు పెట్టాలని, లేకపోతే బిజెపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తుందని ప్రకటించారు. తమ పార్టీకి ఎస్ఆర్‌సితో సంబంధం లేదని, శాసనసభ తీర్మానం అంతకన్నా అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు తెలంగాణపై చిత్తశుద్ధి, విశ్వాసం లేవని, అందుకే అవి మోసం చేస్తూ వస్తున్నాయని మండిపడ్డారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందనడం అసత్యమని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+