రూ.1.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు: చంద్రబాబు
రాజీవ్ యువకిరణాల పేరుతో గొప్పలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సు ఫార్సుగా తయారు కాబోతుందన్నారు. సైన్స్ సిటీ ఎత్తేశారని, నాలెడ్ట్ సిటీ ఎక్కడుందో తెలియకుండా పోయిందన్నారు. ఆదాయానికంటే రెట్టింపు పన్నులు విధించారని, సామాన్యుడిపై మోయలేని భారం మోపారన్నారు. ఎనిమిదేళ్లలో బిసి సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలన్నారు. బడ్జెట్ దోచుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. జలయజ్ఞం గుది బండగా మారిందని, దానిని కాంగ్రెసు ధనయజ్ఞంగా మార్చిందన్నారు. ఆర్థికాభివృద్ధిలో మనం జార్ఖండ్ కంటే వెనుకబడి ఉన్నామన్నారు.
ఆనం బడ్జెట్ పిట్టల దొర మాట్లాడినట్లు పిచ్చి మాటల్లా ఉందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్రా రావు విమర్శించారు. ప్రభుత్వం ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై ఆనం అంకెల గారడి వాస్తవాలను ప్రతిబింబించేలా లేదన్నారు.