తెలంగాణ ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: బాబు
తెలంగాణలోని ఉప ఎన్నికల్లో సమన్వయానికి పార్టీ తెలంగాణ ఫోరానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, టి. దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి నర్సింహులులతో ఓ కమిటీ వేయనుంది. ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు శాసనసభ్యులతో, నాయకులతో సమన్వయకర్తలను వేయాలని నిర్ణయించింది. అదిలాబాద్ జిల్లాకు సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, విజయరామారావు, మొరకరు సమన్వయకర్తలుగా ఉంటారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క, సత్యవతి, సండ్ర వెంకటవీరయ్య సమన్వయకర్తలుగా ఉంటారు.
కామారెడ్డి నియోజకవర్గానికి మండవ వెంకటేశ్వర రావు, అన్నపూర్ణమ్మ, హనుమంత షిండే సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సీతా దయాకర్ రెడ్డి, ఎర్ర శేఖర్, ఎల్లయ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని సమాచారం. నాగర్ కర్నూలుకు కొత్తకోట దయాకర్ రెడ్డి, జైపాల్ యాదవ్, రేవంత్ రెడ్డి సమన్వయ కర్తలుగా ఉంటారు. కొల్లాపూర్ నియోజకవర్గానికి రావుల చంద్రశేఖర రెడ్డి, రాములు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు శుక్రవారం సాయంత్రం నారా చంద్రబాబు నాయుడితో సమావేశమై ఉప ఎన్నికలపై చర్చించారు.