తెలంగాణలో ఉప ఎన్నికలకు అభ్యర్థులు సిద్ధం: సిఎం
వచ్చే మూడేళ్లలో జలయజ్ఞం కింద మూడు లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందిస్తామని చెప్పారు. జలయజ్ఞానికి నిధులు తగ్గించలేదని, నిధులు మిగిలి పోకుండా ఎంత ఖర్చు పెట్టారో అంతే ఇచ్చామన్నారు. ఎక్సైజ్ విధానంలో ఆదాయమే తమకు మార్గం కాదన్నారు. ఈ బడ్జెట్లో రూపాయికి కిలో బియ్యం, విద్యుత్, ఫీజు రీయింబర్సుమెంట్సు కోసం రూ.5వేలకు పైగా పెంచామన్నారు. కొత్త ఏక్సైజ్ పాలసీ అధ్యయానికి మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. నా ఇరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇదే అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పారు. బడ్జెట్ లీక్ కాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమాచార కమిషనర్ల పేర్లను పరీశీలన కమిటీకి పంపించమని లేఖ రాశారని, అది డీసెంట్ నోట్ అవుతుందో కాదో వారే చెప్పాలన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టిన బడ్జెట్ను అంకెల గారడి అని ప్రతిపక్షాలు చెప్పడం సరికాదని మంత్రి పార్థసారథి వేరుగా అన్నారు. సంక్షేమ రంగాలకు పూర్తిగా బడ్జెట్లో న్యాయం చేశామన్నారు. కొందరు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని పబ్బం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి లేదన్నారు.