టిఆర్ఎస్కు షాక్, అసెంబ్లీలో బడ్జెట్కు ఈసి గ్రీన్సిగ్నల్

అంతకుముందు టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు, కొప్పుల ఈశ్వర్ తదితరులు హైదరాబాదులో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం బడ్జెట్ను ఉప ఎన్నికల వరకు వాయిదా వేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశ పెడితే ఉప ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున కేంద్ర బడ్జెట్ను వాయిదా వేసుకున్న సంగతిని వారు గుర్తు చేశారు. అసెంబ్లీలో వారు బడ్జెట్ను ఇప్పుడు ప్రవేశ పెట్టవద్దని ఆందోళన చేశారు. ఈ విషయమై ఈసికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications