హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారు సాక్షులా, నిందితులా తర్వాత చెప్తాం: సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Srilakshmi and Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రాజగోపాల్ నిందితులా, సాక్షులా అనే విషయాన్ని వారిని విచారించిన తర్వాత చెప్తామని సిబిఐ కోర్టుకు తెలిపింది. పెన్నా సిమెంట్స్‌కు గనులు కేటాయిస్తూ జారీ అయిన జీవో ఫైళ్లలో వారి సంతకాలు ఉన్నాయని, వారిని ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ న్యాయవాది రవీంద్రనాథ్ అన్నారు. దీనిపై న్యాయమూర్తి నాగమారుతీశర్మ స్పందిస్తూ - "వారిని ప్రశ్నించాలంటున్నారు, అంటే ఎలా ప్రశ్నిస్తారు? నిందితులుగానా? సాక్షులుగానా?'' అని సీబీఐ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. దీనిపై రవీంద్రనాథ్ బదులిస్తూ - "నిందితులా? సాక్షులా? అన్నది ఇప్పుడే చెప్పలేం. వారిని ప్రశ్నించాక ఆ విషయం తెలుస్తుంది. అపుడే చెప్పగలం!!'' అని అన్నారు. కాగా, సీబీఐ అభ్యర్థనను డిఫెన్స్ న్యాయవాది సురేంద్రరావు తప్పుబట్టారు.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి, గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్‌ను ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని కోర్టును సీబీఐ కోరింది. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. "మా క్లయింట్లు ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు. సీబీఐ వేరే కేసును ప్రస్తావిస్తూ పిటిషన్ వేసింది. ఇది సరి కాదు. ఓబుళాపురం కేసులో ఇప్పటికే చాలా మందిని సీబీఐ ప్రశ్నించింది. అప్పుడు మాట్లాడకుండా, మా క్లయింట్లను కస్టడీకి ఇవ్వాలని ఇప్పుడెందుకు అడుగుతోంది?'' అని అన్నారు. వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును శుక్రవారానికి వాయిదా వేశారు. అదే రోజు కౌంటర్ దాఖలుకు డిఫెన్స్‌కు అవకాశం ఇచ్చారు.

English summary
Court asked CBI that is it want to grill Srilakshmi and Rajagopal as witnesses or accused?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X