జగన్ కేసులో మరో ఐఎఎస్ విచారణ, మీడియాపై ఆరా
గతంలో ఆయన రాష్ట్ర పర్యావరణ, రహదారులు భవనాల శాఖల్లో ముఖ్య హోదాల్లో పనిచేశారు. ఆ సమయంలో జగన్ కేసుకు సంబంధించి జారీ అయిన రెండు జీవోల గురించి సీబీఐ అధికారులు చటర్జీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వాన్పిక్కు భూ కేటాయింపులు జరిగినపుడు అటవీ,పర్యావరణ చట్టానికి సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చారని, ఈ విషయంలో నిబంధనలు పాటించారా? ఏదైనా ఒత్తిళ్లకు గురై అనుమతులు ఇవ్వడం జరిగిందా అనే విషయాలపై చటర్జీ నుంచి సీబీఐ అధికారులు వివరణ కోరినట్లు సమాచారం. ఆ తర్వాత వాన్పిక్ ప్రతినిధులు సీబీఐ ముందు మరోసారి హాజరయ్యారు.
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మిగతా మీడియా సంస్థలను పక్కకుపెట్టి జగన్ మీడియాకు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై సీబీఐ దృష్టి సారించింది. ఈ నెల 21న సీబీఐ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా ప్రకటనలు జారీ చేసిన సమయంలో సమాచార శాఖ కమిషనర్గా వ్యవహరించిన సి.పార్థసారథి, అదనపు డైరెక్టర్ ప్రభాకర్రావు, జాయింట్ డైరెక్టర్ రాజబాబులకు నోటీసులు జారీ చేసింది.