హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవులపై టిడిపి నేత దాడికి కాంగ్రెస్ మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dadi Veerabhadra Rao
హైదరాబాద్: అసెంబ్లీలో పరస్పరం విమర్శలు గుప్పించుకునే అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష తెలుగుదేశంలు గురువారం పదవుల విషయంలో మాత్రం ఒక్కటై పోయాయి. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు మాట్లాడారు. ప్రజా సమస్యలకు సత్యదూరంగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, కరవు, మద్యం సిండికేట్లు, ధరల పెరుగుదల తదితర అంశాల ప్రస్తావన లేకుండానే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారని ధ్వజమెత్తారు. సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైల్ గవర్నర్ తిప్పి పంపించడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అన్నారు. కార్పోరేషన్ పదవులు, వర్సిటీ విసిలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక అంశాల్లో ప్రభుత్వం మండలికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. కౌన్సిల్‌కు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలకు మండలిలోని కాంగ్రెసు ఎమ్మెల్సీలు అందరూ మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో నీకు నూటికి నూరుపాళ్లు సభ మద్దతిస్తోందన్నారు. ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు కూడా ఇవ్వాలని దాడి చెప్పారు. దీనికి కూడా కాంగ్రెసు నేతలు మద్దతు పలికారు.

English summary
Congress MLCs supported Telugudesam Party leader Dadi Veerabhadra Rao comments in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X