నారాయణ పందులదొడ్డి వ్యాఖ్యపై స్పీకర్ సీరియస్

సభలో లేని తమ నాయకుడు నారాయణ గురించి మంత్రి ధర్మాన మాట్లాడటం సరికాదని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, సభలో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలని, సభా మర్యాదలు పాటించాలని సిపిఐ సభ్యుడు కూనంనేని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అంశంపై మాత్రమే మాట్లాడాలని, బయట ఉన్న వాళ్ళ గురించి చర్చించవద్దని స్పీకర్ అన్నారు. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూడటం మంచిది కాదని, ధర్మాన యువకులకు వచ్చేంత ఆవేశంతో మాట్లాడారని, తప్పు చేసిన వాళ్లే అలా ఆవేశపడుతుంటారని, సభలో లేని నారాయణ గురించి మాట్లాడడం పార్లమెంటరీ పద్ధతి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కూనంనేని అన్నారు. నారాయణ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications