హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్సీకి గది ఇవ్వండి: స్పీకర్‌కు విజయమ్మ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. విజయమ్మ ఉదయం బడ్జెట్ సమావేశాలకు హాజరైన విషయం తెలిసిందే. శాసన సభ ప్రాంగణంలో తనకు ప్రత్యేకంగా గది కేటాయించాలని ఆమె సభాపతిని తన లేఖలో కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేగా తనకు క్వార్టర్ కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

తామంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నామని, తమ పార్టీకి చాంబర్ ఇవ్వాలని కడప పార్లమెంటు సభ్యుడు, పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు శోభా నాగి రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, బాలరాజులు కూడా కోరారు. వైయస్ విజయమ్మ, ఎమ్మెల్యేల విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారు. తమ విజ్ఞప్తిని పరిశీలిస్తానని స్పీకర్ చెప్పారని ఎమ్మెల్యేలు మీడియాకు చెప్పారు.

English summary
YS Vijayamma wrote a letter to speaker to allot chamber to YSR Congress Party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X