హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిక్కు కోసం అంజన్ కుమార్‌కు ముఖేష్ గౌడ్ ఎసరు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukesh Goud-Anjan Kumar Yadav
హైదరాబాద్: సికింద్రాబాద్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్‌కు రాష్ట్ర మంత్రి ముఖేష్ గౌడ్ ఎసరు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోకసభ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బిజెపి నేత బండారు దత్తాత్రేయ మాదిరిగానే అంజన్ కుమార్ యాదవ్ పదేళ్లు పార్లమెంటు సభ్యుడిగా చేస్తారని ఆయన అన్నారు. తనకు రాష్ట్ర రాజకీయాలు కిక్కు ఇవ్వడం లేదని, ఢిల్లీ రాజకీయాలు కిక్కు ఇస్తాయేమో చూడాలని ఉందని, అందుకే లోకసభకు పోటీ చేయాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు.

సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తే మజ్లీస్ కూడా అభ్యర్థిని పోటీకి దించుతుందని ఆయన చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్ ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి శానససభకు పోటీ చేస్తారని, తాను సికింద్రాబాద్ నుంచి లోకసభకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే గోషామహల్ శానససభా స్థానాన్ని తాను వదలబోనని ఆయన చెప్పారు ఇక్కడి నుంచి తన కుమారుడు విక్రమ్ శాసనసభకు పోటీ చేస్తారని ఆయన చెప్పారు.

English summary
Minister Mukesh Goud wants to contest from Secunderabad loksabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X