వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపాలనుకున్నందుకే ఆ నేత పైలోకాలకు: కెఏపాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KA Paul
కాకినాడ: తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ సోమవారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేను అ భిషిక్తుడను.. అభిషిక్తుడిని ముట్టుకుంటే పై లోకాలకు పోతారని బైబిల్‌లో రాసి ఉందని అందుకే నన్ను అంతమొందించాలనుకున్న వారు అనంతలోకాలకు పోయారని పాల్ చెప్పారు. తనను అంతమొందించడానికి ప్రయత్నించిన తన సోదరుడు, మరో నలుగురు వ్యక్తులు హార్ట్ అటాక్‌తో, కిడ్నీ వైఫల్యాలతో పరలోకాలకు పోయారన్నారు.

తన ప్రాణాలు తీయడానికి పురికొల్పిన నాయకుడు కూడా తనను ఏమీ చేయలేక పైలోకాలకు పోయారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ స్థాపిస్తే చివరకు తనకు ఓటు హక్కు సైతం లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగిన 148 దేశాల్లో ఎక్కడా ఇంత ఫ్రాడ్ చూడలేదని మండిపడ్డారు. తనకు దైవానుగ్రం ఉందని, ప్రస్తుత సమాజంలో అవినీతి పెచ్చరిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై త్వరలో ఉద్యమిస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీని పునరుద్ధరించి ముందుకు సాగుతూ అవినీతిపై ఉద్యమిస్తానని చెప్పారు.

English summary
Prajasanthi Party chief KA Paul talk with media on monday at Kakinada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X