కాలువలో బస్సు, నాలుగు మృతదేహాలు వెలికితీత

కాలువలో పడిపోయిన బస్సు పి. గన్నవరంలోని సాయి తేజ స్కూల్ బస్సు అని తెలుస్తోంది. ఐదో తరగతి వరకే అక్కడ స్కూలు నడుస్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న పిల్లలు చిన్నవారు కావడంతో ఆందోళన పెరుగుతోంది. కాలువ పది అడుగుల లోతు ఉంటుంది. కాలువ ప్రవహిస్తుండడంతో పిల్లలు కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతుల్లో బిందు మాధవి, అడ్డాల సత్యనారాయణ, అడ్డాల రోహిత ఉన్నట్లు గుర్తించారు.
సహాయక చర్యల నిమిత్తం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. స్వయంగా వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. లారీ అడ్డం రావడంతో బస్సు డ్రైవర్ తప్పించబోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నంలోనే బస్సు కాలువలో పడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications