వైయస్ విజయమ్మకు అవకాశమివ్వండి: శోభా నాగిరెడ్డి

Sobha Nagi Reddy
హైదరాబాద్: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ప్రసంగించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మకు అవకాశమివ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మంగళవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరారు. వైయస్ విజయమ్మకు శాసనసభ ఆవరణలో ప్రత్యేకంగా చాంబరును కేటాయించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. కొద్ది రోజుల క్రితం తనకు చాంబర్ కావాలని విజయమ్మ రాసిన లేఖ విషయం ఆయనకు శోభా నాగి రెడ్డి గుర్తు చేశారు. అసెంబ్లీ వాయిదా పడినప్పుడు విరామంలో విజయమ్మ కూర్చోవడానికి అనువుగా చాంబర్ అవసరమని ఆమె ఆయనను కోరారు.

కాగా ఇటీవల సమావేశాలకు హాజరైన వైయస్ విజయమ్మ తనకు ప్రత్యేక శాసనసభ ఆవరణలో ప్రత్యేక చాంబర్ కావాలంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఆదే సమయంలో మరికొందరు జగన్ వర్గం ఎమ్మెల్యేలు కూడా తమపై అనర్హత నిర్ణయం త్వరగా తీసుకోవాలని లేదా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులుగా ట్రీట్ చేయాలని, తమ పార్టీకి చాంబర్ కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+