ప్రియురాలి కూతురిని కాల్చేసిన కిరాతక ప్రియుడు
ఓ ఖాళీ ఇంట్లోంచి పొగలు వస్తుండడానికి గాజులరామారాం సమీపంలోని మహదేవపురం వద్ద గల పెట్రోల్ బంక్ ఉద్యోగి గుర్తించాడు. అతని చెప్పడంతో కొంత మంది అక్కడికి పరుగెత్తారు. చాపలో చుట్టి ఉన్న బాలిక తగలబడిపోతుండడాన్ని వారు గమనించారు. అక్కడే ఉన్న విజయ్ను వాళ్లు పట్టుకున్నారు. వెంటనే మంటలను ఆర్పి బాలికను ఆస్పత్రికి తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. గాంధీ ఆస్పత్రిలో ఆ బాలిక మరణించింది. విజయ్ను పోలీసులకు అప్పగించారు.
రెండేళ్ల క్రితం సుజాత భర్త చెన్నయ్య మరణించాడు. దీంతో తనకు దూరపు బంధువైన విజయ్తో ఆమెకు సాన్నిహిత్యం పెరిగింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన విజయ్తో ఆమెకు లైంగిక సంబంధం కూడా ఏర్పడింది. దినసరి కూలీ అయిన సుజాతతో విజయ్ తరుచుగా గడుపుతుండేవాడు. మంగళవారం ఉదయం సుజాత కూలీకి వెళ్లిన తర్వాత ఆమె కూతురు భవానీని తీసుకుని ఖాళీగా ఉన్న ఇంటికి తీసుకుని వచ్చాడు. చాపలో చుట్టుకుని తీసుకు వచ్చిన భవానీ ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు.