మరో మైనింగ్ కేసు: 2 రోజుల్లో బెంగళూరుకు గాలి షిఫ్ట్
కాగా ఓఎంసి అక్రమాల కేసులో గాలి ఆగస్టు 4వ తేదిన అరెస్టు అయ్యారు. ఆ తర్వాత నవంబర్లో ఎఎంసి పైన సిబిఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది. అందులో 21 పేర్లు పేర్కొంది. ఏఎంసి కేసులో బెంగళూరు కోర్టులో హాజరు పర్చేందుకు గాలిని రోడ్డు మార్గంలో గానీ విమానంలో గానీ తీసుకు వెళ్లే అవకాశముంది. మరోవైపు గాలి ఓఎంసి కేసులో హైదరాబాద్లో బెయిల్ పొందినా ఎఎంసి కేసులో కర్నాటకలో బెయిల్ పొందే వరకు ఆయన జైలులోనే ఉండవలసి ఉంటుంది. గాలి విషయమై ఇప్పటికే సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అధికారులకు లేఖ రాశారట. సిబిఐ గాలిని బెంగళూరు కోర్టులో హాజరుపర్చి అనుమతితో తమ కస్టడీలోకి తీసుకొని ఎఎంసిపై ప్రశ్నించే అవకాశముంది.
Comments
gali janardhan reddy karnataka bangalore cbi probe hyderabad గాలి జనార్ధన్ రెడ్డి కర్నాటక బెంగళూరు సిబిఐ దర్యాఫ్తు హైదరాబాద్
English summary
Former Karnataka minister and mining scam accused Gali Janardhan Reddy will be produced in the Bengaluru CBI court on March 2 in connection with the Associated Mining Company (AMC) scam.
Story first published: Wednesday, February 29, 2012, 12:16 [IST]