హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై చిదంబరాన్ని జైల్లో పెట్టాలి: స్వామి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Subrahmanian Swami
హైదరాబాద్: తెలంగాణపై మాట మార్చినందుకు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో పెట్టాలని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి వ్యాఖ్యానించారు. తెలంగాణ రచ్చకు చిదంబరమే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణపై గురువారం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

హిందీ రాష్ట్రాలు ఎనిమిది ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మన దేశాన్ని 50 రాష్ట్రాలుగా విభజించాలని, ఆ ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి చిదంబరం వెనకడుగు వేశారని ఆయన విమర్శించారు.

English summary
Janata party president Subrahmanian swami made comment against home minister P chidambaram on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X