హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పేరు చెప్పి వైయస్ జగన్ దోపిడీ చేశారు: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాలకు పాల్పడ్డారని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇప్పుడు సానుభూతి కోసం జగన్ వైయస్సార్ పేరు వాడుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజల సానుభూతి పొంది ఓట్లు సంపాదించుకోవడానికి జగన్ ఇప్పుడు వైయస్సార్ పేరు వాడుకుంటున్నారని, వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు సొత్తు అని ఆయన అన్నారు.

స్పీకర్ వేటు వేయడం వల్ల ఖాళీ అయిన 17 శాసనసభా స్థానాల్లో కూడా విజయం తమ పార్టీదేనని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో జయాపజయాలకు పార్టీ నాయకులు సమిష్టి బాధ్యత వహిస్తారని ఆయన చెప్పారు. వచ్చే 17 శాసనసభా స్థానాల ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ అనే మాటను ఆయన వ్యతిరేకించారు. తాడు బొంగురం లేనివారు ఏదైనా మాట్లాడుతారని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు. తమ పార్టీకి ఓ సిద్ధాంతం, ఆలోచన, విధానం ఉన్నాయని, మిగతావారి లాగా తాము మాట్లాడలేమని ఆయన అన్నారు. ఏమైనా ఎన్నికల్లో జయాపజయాలను ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

English summary
PCC President Botsa Satyanarayana alleged that YSR Congress president YS Jagan used YSR name for his illegal activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X