నాపై పోటీ చేస్తే తెరాస స్వయంకృతమే: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: తనపై వరంగల్ జిల్లా పరకాల శాసనసభా నియోజకవర్గంలో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) స్వయంకృతాపరాధమేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ శాసనసభ్యురాలు కొండా సురేఖ అన్నారు. కాంగ్రెసు పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఆమె స్పీకర్ నాదెండ్ల మనోహర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. వైయస్ రాజశేఖర రెడ్డి కోసం తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని, తెలంగాణ కోసం శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశానని, అందువల్ల పరకాలలో తెరాస తనకు మద్దతు ఇవ్వాలని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

వైయస్ రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వం అదే కుటుంబాన్ని అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ప్రజలకు అవకాశం వచ్చిందని ఆమె అన్నారు. రాజీనామా చేసిన ఆరు నెలలకు ప్రభుత్వం తమపై వేటు వేసిందని, దీన్ని బట్టి ప్రభుత్వానికి ఎంత భయంగా ఉందో అర్థమవుతుందని ఆమె అన్నారు. తెలంగాణలో ఒక్క నియోజకవర్గమైనా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు. వేటు పడిన 16 మంది శాసనసభ్యుల్లో తెలంగాణ నుంచి కొండా సురేఖ ఒక్కరే ఉన్నారు.

కాగా, తమపై అనర్హత వేటు వేయడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు ఆహ్వానిస్తున్నారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభలో అడుగు పెడతామని వారంటున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బాబూరావు తిరుమలలో అన్నారు. అనర్హత వేటు పడిన తాము 17 మందిమి వైయస్ కాంగ్రెసు పార్టీ తరఫున శాసనసభలోకి అడుగు పెడతామని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కలలు గన్న రాజ్యం తేవడం జగన్‌కే సాధ్యమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+