హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ అవినీతిని కప్పిపుచ్చడానికే డ్రామా: మోత్కుపల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu
హైదరాబాద్‌: వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిని కప్పిపుచ్చడానికే కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు డ్రామా ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలు తోడు దొంగలని తెలుగుదేశం శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. వైయస్ జగన్‌ అవినీతి నుంచి, కాంగ్రెస్‌ అసమర్థ పాలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజా సమస్యలపై రాజీనామా చేయని ఎమ్మెల్యేలు, వైఎస్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చగానే రాజీనామా చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఆ రెండు పార్టీలను ఓడించడానికి తాము ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు వ్యతిరేకంగా మోత్కుపల్లి నర్సింహులు పాదయాత్ర చేసే ఆలోచనతో ఉన్నారు. తన ఇంటి నుంచి అమరవీరుల స్థూపం దాకా ఆయన పాదయాత్ర చేస్తారు. తెరాసకు ఓటేస్తే తెలంగాణకు నష్టమని చెప్పడమే తన పాదయాత్ర లక్ష్యమని ఆయన చెప్పారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ఈ పాదయాత్ర చేస్తానని ఆయన చెప్పారు.

English summary
TDP MLA Mothkupalli Narsimhulu charged that Congress and YSR Congress are playing bypolls drama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X