రామోజీరావు భూసర్వేపై జగన్ సాక్షి డైలీ అటాక్
సాక్షి దినపత్రిక కథనం ప్రకారం - ఆరు నెలల క్రితం రామోజీ ఆధీనంలో ఉన్న మిగులు భూమిని ఇళ్ల స్థలాల కోసం చదును చేసేందుకు ఉపక్రమించారు. అయితే ఫిలింసిటీ సిబ్బంది గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రామోజీ భూములను సర్వే చేసి మిగులు భూములుంటే గుర్తిస్తామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. దీంతో అప్పుడు పరిస్థితి సద్దుమణిగింది.
ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదని సాక్షి దినపత్రిక ఆరోపించింది. ఎట్టకేలకు శుక్రవారం అధికారులు కదిలారని చెప్పింది. అనాజ్పూర్ గ్రామపరిధిలోనుూ 60.10 ఎకరాల మిగులు భూమి కూడా రామోజీ ఫిలిం సిటీ ఆక్రమణలో ఉన్నట్లు తేలిందని, దాంతో దాన్ని మిగులు భూమిగా గుర్తించి జాయింట్ కలెక్టర్ కోర్టుకు వెళ్లారని, దీనిపై రామోజీ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిందని, దీనిపై ఉషా కిరణ్ మూవీస్ హైకోర్టును ఆశ్రయించిందని సాక్షి దినపత్రిక రాసింది.