లాలూచి పడి: జగన్, కెసిఆర్లను కలిపి కడిగేసిన బాబు

జగన్ అక్రమాలకు పాల్పడినప్పుడే ఆయన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ అది తప్పని చెబితే బాగుండేదన్నారు. జగన్కు ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కంటే ముఖ్యమంత్రి పదవే ముఖ్యమన్నారు. అధికార కాంగ్రెసు పార్టీ పైనా బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఆదాయం లేక అప్పుల కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అవినీతి, అక్రమాలకు ఓటు వేసినట్లేనని ఆయన అన్నారు. అధికారంలో కాంగ్రెసు వంటి అసమర్థ పార్టీ ఉండటం వల్లనే పాలన దారుణంగా ఉందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు.












Click it and Unblock the Notifications