అమ్మాయిలపట్ల అసభ్య ప్రవర్తన: టీచర్లకు దేహశుద్ధి

కాగా ఖమ్మం జిల్లాలో విద్యార్థులను వేధించిన కీచక ప్రిన్సిపల్కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్లోని శారద పాఠశాల ప్రిన్సిపల్ ట్యూషన్కు వస్తే ప్రత్యేక పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను ద్వందార్థాల మాటలతో వేధిస్తుండటంతో ఆ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలియ జేశారు. దాంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీయడమే కాకుండా ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం నిందితుడిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, విద్యార్థుల ఫీజులు తగ్గించమని అడిగినా తగ్గించానని, మరో స్కూలుతో చేతులు కలిపిన తల్లిదండ్రులు తనపై ఆరోపణలు చేసి దాడి చేశారని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications