అమ్మాయిలపట్ల అసభ్య ప్రవర్తన: టీచర్లకు దేహశుద్ధి
కాగా ఖమ్మం జిల్లాలో విద్యార్థులను వేధించిన కీచక ప్రిన్సిపల్కు విద్యార్థుల తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్లోని శారద పాఠశాల ప్రిన్సిపల్ ట్యూషన్కు వస్తే ప్రత్యేక పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను ద్వందార్థాల మాటలతో వేధిస్తుండటంతో ఆ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలియ జేశారు. దాంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ను నిలదీయడమే కాకుండా ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం నిందితుడిని వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, విద్యార్థుల ఫీజులు తగ్గించమని అడిగినా తగ్గించానని, మరో స్కూలుతో చేతులు కలిపిన తల్లిదండ్రులు తనపై ఆరోపణలు చేసి దాడి చేశారని ప్రిన్సిపల్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
English summary
Two teachers harassed students in Krishna and Khammam district. Police arrested teachers.
Story first published: Monday, March 5, 2012, 14:07 [IST]