జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: జెసి

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ క్రమంగా తగ్గుతోందని అనంతపురం జిల్లా మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం అన్నారు. జగన్‌కు కడపలో ఉన్నంత సెంటిమెంట్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఉండదని చెప్పారు. సెంటిమెంట్ పని చేయదన్నారు. గతంలో సభను నడిపించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతిపక్షాలపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తీర్మానాలపై పదే పదే రచ్చ చేస్తూ శాసనసభను వాయిదా పడేలా చేయడం సరికాదని ఆయన విపక్షాల తీరును తప్పు పట్టారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి తగ్గిపోతోందన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సభలకు, ప్రచార యాత్రలకు వచ్చిన వారు అందరూ ఓటు వేయరని ఆయన అన్నారు. కాగా జగన్మోహన్ రెడ్డి యాత్రల వల్ల ఆయనకు ఖర్చు భారం మిగలడం తప్ప మరే లాభముండదని జెసి మంగళవారం అన్న విషయం తెలిసిందే. బహిరంగ సభలకు జనాలను తరలించినంత మాత్రానే ఓట్లు రాలవని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభలకు లారీల్లో, బస్సుల్లో జనాలను తరలించే విధానానికి స్వస్తి పలకాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గతంలో కొందరు రాజకీయ నాయకుల సభలకు భారీగా జనాలు వచ్చినా, ఆ స్థాయిలో ఓట్లు పడక ఆయా పార్టీల అభ్యర్థులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+