ఇద్దరి హత్యకు దారి తీసిన అక్రమ సంబంధం

Charminar
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బుధవారం ఉదయం దారుణ సంఘటన చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గుడాలో అన్నాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. చెల్లె వైవాహికేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు అనుమానిస్తున్నారు. తానే హత్య చేశానంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో లొంగిపోయాడు.

అందిన వివరాల ప్రకారం - కిరణ్, ప్రభావతి అనే అన్నాచెల్లెళ్లు యూసుఫ్‌గుడాలో కలిసి ఉంటున్నారు. కొద్ది కాలం క్రితం ప్రభావతి భర్తను వదిలేసింది. ఆమెకు మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం ఏర్పడింది. దీంతో అన్నాచెల్లెళ్లకు మధ్య ఈ విషయంపై తరుచూ గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే వారిద్దరిని శ్రీనివాస్ హత్య చేశాడని అంటున్నారు. తనను బంధించినందుకే హత్య చేశానని శ్రీనివాస్ అంటున్నాడు. ప్రభావతికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతను ప్రభావతి తల్లి వద్ద ఉంటున్నాడు. ఇద్దరి మృతదేహాలను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+