బాణసంచా కేంద్రంలో పేలుడు, నలుగురు దుర్మరణం

బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్కు మించి ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. మంటలను అర్పడానికి ఫైరింజన్ చాలా ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది. బాణసంచా కేంద్రంలో ప్రతి రోజు 8 నుంచి 10 మంది పనిచేస్తుంటారు. ఎప్పటిలాగే బుధవారం కూడా వారు పనిచేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉగాది, శ్రీరామనవమి పండుగల కోసం క్రాకర్లు చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయి. దీంతో జనవరి నుంచి మార్చి నెల చివరి వరకు ఈ కేంద్రంలో బాణసంచా తయారు చేస్తుంటారు.












Click it and Unblock the Notifications