ముఖ్యమంత్రి పీఠం: అఖిలేష్ యాదవ్పై తీవ్ర ఒత్తిడి

అఖిలేష్ చెప్పినట్లుగా ప్రస్తుతానికి ములాయం సింగే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, కొన్నాళ్ల తర్వాత బాధ్యతలు తనయుడుకి అప్పగించే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల నుండి వస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో యుపిలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలన్నా, ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుపొందాలన్న అఖిలేష్ వంటి నాయకుడిని సిఎంగా చేయడమే ఉత్తమమని పార్టీ నేతలు పలువురు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ములాయం దృష్టికి తీసుకు వెళుతున్నారట.












Click it and Unblock the Notifications