వైయస్ జగన్ అరెస్టుపై స్టూడియోఎన్ కథనాలు

ఇప్పుడు వైయస్ జగన్ అరెస్టుపై, రాజకీయ భవిష్యత్తుపై వరుస కథనాలు వస్తున్నాయి. అవి జగన్కు అనుకూలమో, వ్యతిరేకమో కూడా అర్థం కాని స్థితి. ఏప్రిల్ 2వ తేదీలోగా జగన్ అరెస్టు అవుతారంటూ ఇటీవల ఆ టీవీ చానెల్ అదరగొట్టింది. దానిపై ప్రత్యేక వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. తాజాగా జగన్ ఒకే ఒక్కడు అంటూ మరో వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ప్రత్యర్థుల ఆరోపణలతో, సిబిఐ దర్యాప్తుతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్యానించింది.
రాష్ట్ర రాజకీయాల్లో జగన్ ఒంటరివాడయ్యారని కూడా ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. జగన్ అరెస్టయితే పరిస్థితి ఏమిటనేది కూడా విశ్లేషించే ప్రయత్నం చేసింది. పార్టీని ముందుకు నడిపించడానికి జగన్ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా వ్యాఖ్యానించింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలతో ఆ వార్తాకథనాన్ని స్డూడియోఎన్ ప్రసారం చేసింది. తెలుగు టీవీ చానెళ్లు ఎటో ఓ దిక్కు అయిపోయిన నేపథ్యంలో వాటి కన్నా భిన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications