భర్త అంత్యక్రియల్ని అడ్డుకున్న భార్య,ఇంటిముందే శవం

నక్కా రమణయ్య అనే వ్యక్తికి కొంత భూమితో పాటు ఇల్లు ఉంది. అతను బంధువుల ఇంట్లో ఉంటూ మరణించాడు. రమణయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో, అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య కూతురు ఇంట్లో ఉంటుంది. రమణయ్య మరణంతో ఆమె కూతురితో పాటు గ్రామానికి వచ్చింది. ఆస్తిని తమకు అప్పగించాలని ఆమె పట్టుబట్టింది. అందుకు బంధువులు నిరాకరించారు. దాంతో మూడు రోజుల పాటు శవం అలాగే ఉంది.
చివరికి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పంచాయతీ చేశారు. రమణయ్య కూతురికి కొంత ఆస్తి ఇచ్చేటట్లు ఒప్పందం చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది. రమణయ్య శవానికి అంత్యక్రియలు జరిగాయి.












Click it and Unblock the Notifications