ముఖ్యమంత్రి పీఠంపైనే జగన్ కన్ను: దామోదర

Damodara Rajanarasimha
హైదరాబాద్: ముఖ్యమంత్రి పీఠంపైనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కన్ను వేశారని ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెసు నాయకుడు దామోదర రాజనర్సింహ అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలనేదే జగన్ సిద్ధాంతమని ఆయన అన్నారు. రైతుల గురించి, విద్యార్థుల గురించి ఏం మాట్లాడినా జగన్‌కు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి అని ఆయన అన్నారు. కాంగ్రెసుకు సిద్ధాంతాల వల్లనే ఓటు బ్యాంక్ ఉందని ఆయన అన్నారు. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే జగన్‌పై కొంత మంది నాయకులు విమర్శలు చేయడం లేదనే వాదనను ఆయన తిరస్కరించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన విభేదాలు లేవని ఆయన శనివారం ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలుంటే తాను ముఖ్యమంత్రితో మాట్లాడుతానని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పేరు మీద ఎంత మంది నాయకులు వచ్చారు, ఎంత మంది నాయకులుగా ఎదిగారని ఆయన అడిగారు. తెలంగాణ అంశం తన చేతుల్లో లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు ఆయన తెలిపారు.

తన వెంట ఉన్నవారు తనకు ఎందుకు దూరమయ్యారో వారినే అడగాలని ఆయన సూచించారు. దళితుడిని అయినందుకే తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చిందని ఆయన చెప్పారు. ఎవరి కోసం కూడా తన ప్రవర్తనను మార్చుకోబోనని ఆయన స్పష్టం చేశారు. చమర్ సమ్మేళనం నిర్వహణలో ఏ విధమైన రాజకీయం లేదని, తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావన కోసమే ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రితో విభేదించాల్సి వస్తే విభేదిస్తానని, తన అభిప్రాయం చెబుతానని ఆయన అన్నారు. స్వీకరిస్తారా, లేదా అనేది ముఖ్యమంత్రి ఇష్టమని, తన అభిప్రాయం మాత్రం కచ్చితంగా చెబుతానని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+