వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా దయతోనే కెసిఆర్ ఎంపి అయ్యారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
మహబూబ్‌నగర్: తమ దయతోనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పార్లమెంటు సభ్యుడయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ ఇవ్వాల్సింది కాంగ్రెసు పార్టీయేనని, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆయన అన్నారు. తాను తెలంగాణ వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, భవిష్యత్తులో మాట్లాడబోనని ఆయన అన్నారు.

కుటుంబ సభ్యులను తెచ్చి ఎన్నికల పేరుతో దందాలు, వసూళ్లు చేస్తున్నారని ఆయన కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం పేరుతో పార్టీ పెట్టి కాంగ్రెసు కంపులో కలిసిపోయారని ఆయన చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. తమది పేదల పార్టీ అని, పేదల పార్టీని దెబ్బ తీయాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ దెబ్బ తీయాలనుకునేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. కాంగ్రెసు ఎనిమిదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. బిజెపికి ఓటేస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu said that TRS president K Chandrasekhar Rao has become MP with his support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X