వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గాలి ఖాతాల నుంచి నేతలకు రూ. 200 కోట్లు బదిలీ?
గాలి జనార్ధన్రెడ్డి పిఏ ఆలీఖాన్ను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలీఖాన్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. జనార్ధన్రెడ్డికి సంబంధించిన పలు ఆస్తులు, ఆదాయ వివరాలను ఆలీఖాన్ సీబీఐ విచారణలో వెల్లడించినట్లు తెలియవచ్చింది. అక్రమ రవాణా చేసే ముడి ఇనుముకు మైనింగ్ కంపెనీలు దాని విలువలో 30 శాతం చొప్పున మామూళ్లు చెల్లించారని ఆలీఖాన్ చెప్పినట్లు సమాచారం. కాగా గాలి జనార్ధన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీబీఐ అధికారులు గత సెప్టెంబర్ నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడే ఏఎంసీ కేసు విషయమై కర్నాటక సీబీఐ అధికారులు గాలిని, ఆయన పీఏ అలీఖాన్ను విచారణ చేస్తున్నారు.
Comments
gali janardhan reddy karnataka illegal mining bangalore గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక అక్రమ మైనింగ్ బెంగుళూరు
English summary
According to media reports - About Rs 200 crores were transferred to political leaders from Gali Janardhan reddy's accounts.
Story first published: Saturday, March 10, 2012, 17:07 [IST]