గాలి ఖాతాల నుంచి నేతలకు రూ. 200 కోట్లు బదిలీ?

గాలి జనార్ధన్రెడ్డి పిఏ ఆలీఖాన్ను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అలీఖాన్ పలు కీలక విషయాలను వెల్లడించినట్లు సమాచారం. జనార్ధన్రెడ్డికి సంబంధించిన పలు ఆస్తులు, ఆదాయ వివరాలను ఆలీఖాన్ సీబీఐ విచారణలో వెల్లడించినట్లు తెలియవచ్చింది. అక్రమ రవాణా చేసే ముడి ఇనుముకు మైనింగ్ కంపెనీలు దాని విలువలో 30 శాతం చొప్పున మామూళ్లు చెల్లించారని ఆలీఖాన్ చెప్పినట్లు సమాచారం. కాగా గాలి జనార్ధన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ సీబీఐ అధికారులు గత సెప్టెంబర్ నెలలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడే ఏఎంసీ కేసు విషయమై కర్నాటక సీబీఐ అధికారులు గాలిని, ఆయన పీఏ అలీఖాన్ను విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications