మహబూబ్‌నగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోత్కుపల్లి మనిషో, జంతువో అర్థం కావట్లేదు: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

etela rajender
మహబూబ్ నగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్న టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు మనిషో, జంతువో అర్థం కావడం లేదని టిఆర్ఎస్ సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఆదివారం అన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చేస్తున్న మోత్కుపల్లికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఆయన మహబూబ్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. తమపై అర్థం పర్థంలేని ప్రచారానికి దిగుతున్న బాబును, టిడిపిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిషేధించారని అన్నారు. బిజెపి గురించి తామెప్పుడూ మాట్లాడలేదని అయినా ఆ పార్టీ నేతలు తమ గురించి విమర్శలు చేయడం సరికాదన్నారు.

కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇంకా నాన్చకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వేరుగా హైదరాబాదులో అన్నారు. అలా అయితేనే పార్టీని కాపాడగలమని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయని అన్నారు. దక్షిణ భారతంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ విషయాన్ని అధిష్టానానికి చెబుతామన్నారు. తెలంగాణ నేతలు పరస్పరం దూషించుకోవడం సరికాదన్నారు. ఒక పార్టీ నేత ఉప ఎన్నికల ద్వారా సీట్లు పెంచుకోవాలని చూస్తుంటే మరో నేత పార్టీ బలోపేతం కోసం చూస్తున్నారన్నారు.

English summary
TRS leader Etela Rajender blamed Mothkupalli Narasimhulu today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X