మోత్కుపల్లి మనిషో, జంతువో అర్థం కావట్లేదు: ఈటెల
కాంగ్రెసు పార్టీ మోసం చేసిందన్న భావనలో తెలంగాణ ప్రజలు ఉన్నారని, ఇంకా నాన్చకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వేరుగా హైదరాబాదులో అన్నారు. అలా అయితేనే పార్టీని కాపాడగలమని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ పరిచాయని అన్నారు. దక్షిణ భారతంలో తెలంగాణ ప్రాంతంలోనే కాంగ్రెసు పార్టీ బలంగా ఉందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ విషయాన్ని అధిష్టానానికి చెబుతామన్నారు. తెలంగాణ నేతలు పరస్పరం దూషించుకోవడం సరికాదన్నారు. ఒక పార్టీ నేత ఉప ఎన్నికల ద్వారా సీట్లు పెంచుకోవాలని చూస్తుంటే మరో నేత పార్టీ బలోపేతం కోసం చూస్తున్నారన్నారు.
Comments
English summary
TRS leader Etela Rajender blamed Mothkupalli Narasimhulu today.
Story first published: Sunday, March 11, 2012, 16:55 [IST]