బాబుతో జగన్ కుమ్మక్కు, లాక్కుంటే రాదు: చిరంజీవి

జగన్ సొమ్ము దోచుకున్న జగన్ ప్రజా సేవ ఎలా చేస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం అనేది ప్రజల నుండి రావాలి తప్ప బలవంతంగా తీసుకుంటే రాదని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఉప ఎన్నికలను తీసుకు వచ్చారన్నారు. టిడిపి పాలనలో రైతులకు బాబు చేసిందేమీ లేదన్నారు. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అన్నారు. కుట్రతో ఉప ఎన్నికలు తీసుకు వచ్చిన టిడిపి, జగన్ పార్టీకి కాకుండా కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు.అంతకుముందు చిరంజీవి గుడిలో పూజలు చేశారు. కాగా చిరంజీవిని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు.












Click it and Unblock the Notifications